తెలంగాణ సమాజాన్ని ఆదుకోవాలంటే మేధావులు కాంగ్రెస్‌లో చేరాలి - కాంగ్రెస్‌ నేతలు

Update: 2019-09-13 16:16 GMT

తెలంగాణ సమాజాన్ని ఆదుకోవాలంటే మేధావులు కాంగ్రెస్ లో జాయిన్ కావాలన్నారు కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్, వీహెచ్‌లు. రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య కాంగ్రెస్ లోకి చేరడం సంతోషంగా ఉందన్న వారు ఈనెల 17 వ తేదీన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా జాతీయ జెండా ఎగరేస్తామన్నారు. మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలు హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని...రైతులను కేసీఆర్ మోసం చేశారన్న నేతలు.. రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. టెర్రరిజం ఒక మతానికి సంబంధించింది కాదని.. టెర్రరిజాన్ని ఒక మతానికి అంటగట్టాలని మోడీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

Tags:    

Similar News