CM KCR: ఢిల్లీలో టీఆర్‌ఎస్ కార్యాలయ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు

CM KCR: సెప్టెంబర్ 2న ఢిల్లీ వసంత్‌విహార్‌లో పార్టీ కార్యాలయ ఏర్పాటుకు భూమి పూజ చేయనున్న సీఎం కేసీఆర్

Update: 2021-08-30 10:10 GMT

ఢిల్లీలో తెరాస పార్టీ కార్యలయానికి ముహూర్తం ఫిక్స్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: మరోసారి హస్తినబాట పట్టనున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈసారి మూడు రోజుల పాటు సీఎం ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. సెప్టెంబర్ 2న ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా భూమి పూజ చేయనున్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అలాగే ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను సీఎం కేసీఆర్ కలవనున్నారు. అనంతరం మూడో తేదిన హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారు.

టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి ఢిల్లీలో స్థలం ఇచ్చింది కేంద్రం. 2020 అక్టోబర్ 9న 1300 చదరపు మీటర్ల భూమిని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేటాయించింది. దీంతో ఇప్పుడు ఢిల్లీ వసంత్ విహార్ లో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయ భూమి పూజకి ఏర్పాట్లు చేశారు. ప్రొక్లెయిన్ తో రాళ్లను తొలగింపు, మట్టి చదును పనులు చేశారు. సెప్టెంబర్ 2న ఈ స్థలంలో భూమి పూజ చేయనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలుగు రాష్ట్రాల నుంచి తొలిసారిగా ఒక ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో కార్యాలయం ఏర్పాటు కానుంది. 

Full View


Tags:    

Similar News