Revanth Reddy: ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన సీఎం రేవంత్రెడ్డి
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీ వెళ్లారు.
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీ వెళ్లారు. ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్య సమావేశాలు నిర్వహించనున్నారు.
ప్రధానంగా, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు గురించి చర్చించడానికి రేవంత్ రెడ్డి కేంద్ర అధికారులను కలవనున్నారు. మెట్రో ప్రాజెక్టుకు త్వరగా అనుమతులు ఇవ్వాలని, రాష్ట్రానికి మద్దతు అందించాలని కేంద్రాన్ని మరోసారి కోరనున్నారు.
అంతేకాదు, మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు (Regional Ring Road)కు అనుమతులు, నిధులు త్వరితగతిన మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి వినతిపత్రం సమర్పించనున్నారు. ఈ పర్యటన రాష్ట్ర అభివృద్ధి పనులకి కీలకంగా మారనుందని అధికార వర్గాలు వెల్లడించాయి.