ఈ నెల 20, 21న చింతమడకకు కేసీఆర్ పయనం

Update: 2019-07-16 09:11 GMT

సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకకు ఈ నెల 20, 21న కేసీఆర్ పయనం కాబోతున్నారు. ఆ రోజు గ్రామంలో సీఎం సభ, సమావేశం నిర్వహించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. కుల వృత్తుల చేసుకునే వారికి యంత్రాలు, వాహనాలు మంజూరు చేయనున్నారు. బీసీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల వసతి గృహానికి శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి గ్రామస్తులతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. 

ఈ నేపధ్యంలో అక్కడి ఏర్పాట్లను సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు పరిశీలించారు. గ్రామంలోని ఐకేపీ గోదాం సీసీ ప్లాట్‌ఫామ్ వద్ద సీఎం సభ నిర్వహించాలని, 3,200 మంది గ్రామస్థులకు, 200 మంది అధికారులకు కుర్చీలు ఏర్పాటుచేయాలని, మరో 200 కుర్చీలతో ప్రెస్‌గ్యాలరీ ఏర్పాటుచేయాలని హరీష్ రావు అధికారులకు సూచించారు. 

Full View

Tags:    

Similar News