ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం

ప్రగతిభవన్‌లో మంత్రులు, టీఆర్ఎస్‌ ముఖ్యనేతలు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. దుబ్బాకలో ఓటమి, రైతు సమస్యలపై మంతనాలు జరుపుతున్నారు.

Update: 2020-11-12 10:41 GMT

ప్రగతిభవన్‌లో మంత్రులు, టీఆర్ఎస్‌ ముఖ్యనేతలు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. దుబ్బాకలో ఓటమి, రైతు సమస్యలపై మంతనాలు జరుపుతున్నారు. త్వరలో జరగనున్న GHMC, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చిస్తున్నారు. అయితే, దుబ్బాకలో టీఆర్ఎస్‌ ఓటమికి కారణాలను అడిగి తెలుసుకున్న సీఎం కేసీఆర్.... సిట్టింగ్ సీటులో ఎందుకంత వ్యతిరేకత వచ్చింది... ఎక్కడ విఫలమయ్యామంటూ విశ్లేషించారు. అదేసమయంలో, విపక్షాలు పుంజుకోకముందే GHMC ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు. దాంతో, GHMCలో నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్‌ఛార్జ్‌లను నియమించాలని ఆదేశించారు. ఇక, హైదరాబాద్‌లో వరద సాయంపై జరుగుతోన్న రగడంపై సీఎం కేసీఆర్ చర్చించారు.

Tags:    

Similar News