ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ బిజీ... సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ
ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ బిజీ బిజీ మధ్యాహ్నం 1.30గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ సాయంత్రం 4.30గంటలకు ప్రధాని మోడీతో భేటీ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్షాలతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 1.30గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సమావేశం కానున్న కేసీఆర్ కల్యాణ్ మార్గ్లోని ప్రధాని అధికారిక నివాసంలో సాయంత్రం 4.30గంటలకు మోడీతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనన్నారు. ఈ పర్యటనలో కేసీఆర్ వెంట ఎంపీలు కేకే, నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు రాజీవ్శర్మ తదితరులు ఉన్నారు.ూ