ఈవీఎంలపై రజత్‌కుమార్ కీలక వ్యాఖ్యలు

Update: 2019-01-22 14:28 GMT

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈవీఎంల ట్యాపరింగ్ పై వివిధ రాజకీయ పార్టీల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాపరింగ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే ఈ ఆరోపణలు నిజంకాదని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ అప్పట్లోనే స్పష్టం చేశారు. తాజాగా మరోసారి ఈ ఆరోపణలపై మాట్లాడుతూ..

ఈవీఎంల ట్యాపరింగ్ అసాధ్యమని.. వీటిపై ఈసీఐఎల్ సంస్థ, ఈసీ, సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చాయి. ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయొద్దు. లోక్‌సభ ఎన్నికలు కూడా ఈవీఎంల ద్వారానే జరుగుతాయి. ఈవీఎంలపై ఓటర్లకు మరింత అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడతామని రజత్‌కుమార్ వ్యాఖ్యానించారు.

Similar News