ఫ్యామిలీని జైలుకు పంపొద్దని కేంద్రం దగ్గర కేసీఆర్ పొర్లుదండాలు : బండి సంజయ్

Update: 2021-01-02 15:15 GMT

తన కుటుంబాన్ని జైలు పాలు చేయొద్దని కేంద్రం ముందు కేసీఆర్ పొర్లుదండాలు పెడుతున్నారంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్, డిచ్‌పల్లికి చెందిన టీఆర్ఎస్ నేతలు కమలం పార్టీలో చేరగా కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారాయన. గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు ఏమనుకుంటున్నారో ఒకసారి రిపోర్ట్ తెప్పించుకోవాలని సీఎం కేసీఆర్‌కు సూచించారు. టీఆర్ఎస్ నుంచి 30 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని బండి సంజయ్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News