ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సికింద్రబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద బంద్లో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీడియాతో మాట్లాడుతుండగానే కోదండరాంతో పాటు పలువురిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరుపై కోదండరాం మండిపడ్డారు. రాష్ర్టంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అననుమానం కల్గుతుందన్నారు.