కాంగ్రెస్ నాయకుల మెరుపు ర్యాలీ..భట్టి, వీహెచ్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అరెస్ట్
హైదరాబాద్ చార్మినార్ దగ్గర కాంగ్రెస్ నాయకులు మెరుపు ర్యాలీ చేపట్టారు. చార్మినార్ దగ్గర రాజీవ్ సద్భావన యాత్ర మీటింగ్ను ముగించిన నాయకులు ఆర్టీసీ కార్మికుల బంద్కు సంఘీభావంగా ర్యాలీ చేప్టటారు. ఎంజీబీఎస్కు వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదంటూ అరెస్ట్ చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్బాబు, సీనియర్ నేత వీహెచ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బహదూర్పుర పోలీస్స్టేషన్కు తరలించారు.