ఈ నెల 20వ తేదీ వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టే తేదీతో పాటు శాసనసభ, మండలి సమావేశాల ఎజెండాను ఖరారు చేశారు.
రేపు సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. ఈనెల 8న అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. మొత్తం 12 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల 9, 10, 15 తేదీల్లో సభకు సెలవులు ప్రకటించారు. బీఏసీ సమావేశానికి సీఎం కేసీఆర్, మంత్రులు, అక్బరుద్దీన్ ఓవైసీ, భట్టి విక్రమార్క హాజరయ్యారు.