వచ్చే నెలలో జంట నగరాలలో జరగనున్న బోనాల ఉత్సవాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జులై 4వ తేదీ నుండి ఆషాడం బోనాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ట్రాఫిక్ సిబ్బంది, పోలీసులు, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, వైద్యశాఖ, ఆర్ అండ్ బి తదితర శాఖల ఆధ్వర్యంలో అన్నీ ఏర్పాట్టు చేస్తున్నట్టు మంత్రి వివరించారు. బోనాలకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపనుంది.