ఫలించిన ఎంపీ ధర్మపురి అరవింద్ రాయబారం.. టీడీపీకి ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే గుడ్ బై
నిజామాబాద్ ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, ఆమె కుమారుడు మల్లికార్జున్రెడ్డి టీడీపీకి గుడ్బై చెప్పనున్నారు. అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎంపీ ధర్మపురి అరవింద్ నేతృత్వంలో ఇవాళ సాయంత్రం 5గంటలకు బీజేపీలో చేరనున్నారు. దీంతో ఇప్పటికే అన్నపూర్ణమ్మ కుటుంబం ఢిల్లీకి చేరుకుంది.