హుజూర్నగర్ టీడీపీ అభ్యర్థి ఈమే....
హుజూర్నగర్ ఉపఎన్నికకు టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటిచింది. టీడీపీ సీనియర్ నాయకురాలు కిరణ్మయిని అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆమెకు బీఫామ్ అందచేశారు.
హుజూర్నగర్ ఉపఎన్నికకు టీటీడీపీ తమ అభ్యర్థిని ప్రకటిచింది. సీనియర్ నాయకురాలు కిరణ్మయిని అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆమెకు బీఫామ్ అందచేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు ఇటీవలే హుజూర్ నగర్ ఉపఎన్నికపై ప్రత్యేక దృష్టి సారిచారు. పార్టీ నాయకులతో సమావేశమై ఎన్నికల్లో పోటీ చేయాలని లేకుంటే పార్టీ నమ్ముకున్న క్యాడర్ కు నష్టం వాటిల్లితుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అభ్యర్థిని ప్రకటించాలని పార్టీ నిర్ణయించింది. టీడీపీ సీనియర్ నాయకురాలు కిరణ్మయిని ప్రకటిస్తు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిర్మణయి.. చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ సైదిరెడ్డిను, కాంగ్రెస్ పద్మావతి రెడ్డి, బీజేపీ నుంచి కోట రామారావును అభ్యర్థులుగా బరిలో నిలిపాయి.