త్వరలో హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ప్రధాన పార్టీలు అయిన టీఆర్ఎస్ ,బీజేపీ,కాంగ్రెస్ తమ తమ అభ్యర్దులను ప్రకటించాయి. అక్కడ గేలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగానే శ్రమిస్తున్నాయి. అయితే ఈ ఉపఎన్నికల్లో టీడీపీ కూడా బరిలోకి దిగబోతుంది. అభ్యర్దిని బరిలోకి దించాలని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రేపు టీటీడీపీ నేతలు అభ్యర్దిని ఖరారు చేయనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఇక్కడ తిరిగి ఉపఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. అక్టోబరు 21న పోలింగ్ జరిగి, అదే నెల 24న ఫలితాలు విడుదల కానున్నాయి.