హైదరాబాద్ హయత్నగర్లో స్వామి వివేకానంద విగ్రహానికి అవమానం జరిగింది. కుంట్లూరులో స్వామి వివేకానంద విగ్రహం చేతిలో దుండగులు మద్యం బాటిల్స్ పెట్టారు. అనుమానంతో ముగ్గురిని పట్టుకుని చితబాదిన స్థానికులు వాళ్లను పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో తమ పనేనని ముగ్గురు నిందితులు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఆ ముగ్గురు ఎవరు..? ఏ ప్రాంతానికి చెందిన వారు..? జనాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టడానికే ఇలా చేస్తున్నారా..? లేకుంటే మరేమైనా కారణాలున్నాయా..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.