అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల అనుమానాస్పద మృతి

America: ఉన్నత చదువుల కోసం 16 రోజుల క్రితం అమెరికాకు వెళ్లిన విద్యార్థులు

Update: 2024-01-14 08:31 GMT

అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల అనుమానాస్పద మృతి

America: పండగ పూట విషాదం చోటుచేసుకుంది. అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం.. ఇప్పుడు కలకలం రేపుతోంది. రూమ్‌లో మృతదేహాలను గుర్తించారు పోలీసులు. మృతుల్లో ఒకరు వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన గట్టు దినేష్‌ కాగా.. మరొకరు శ్రీకాకుళంకు చెందిన విద్యార్థిగా గుర్తించారు. ఉన్నత చదువుల కోసం 16 రోజుల క్రితమే విద్యార్థులు అమెరికాకు వెళ్లినట్టు తెలుస్తోంది.

వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన గట్టు వెంకన్నకు కొడుకు, కూతురు ఉన్నారు. కుమారుడు దినేష్.. 17 రోజుల క్రితం MS చేయడానికి అమెరికా వెళ్లాడు. హార్ట్‌ఫోర్డ్‌ రాష్ట్రంలోని ఓ కాలేజీలో MS చదువుతున్నాడు. ఏమైందో తెలియదు కానీ.. రాత్రి తన రూమ్‌లో దినేష్‌తో పాటు శ్రీకాకుళంకు చెందిన మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం జరిగింది. దీంతో ఆయా ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News