బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో భూమా అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌పై సందిగ్ధత

Update: 2021-01-22 06:26 GMT

భూమా అఖిలప్రియ (ఫైల్ ఇమేజ్)

బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో భూమా అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌పై సందిగ్ధత కొనసాగుతోంది. ఇవాళ మరోసారి అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌పై సెషన్స్‌ కోర్టు విచారణ జరపనుంది. అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్‌ దాఖలు చేశారు. ఇదే కేసులో అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌, సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై కూడా విచారించనుంది. భార్గవ్‌రామ్‌, జగత్‌ విఖ్యాత్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై కూడా పోలీసులు కౌంటర్‌ దాఖలు చేశారు. ఈ మూడు బెయిల్‌ పిటిషన్లపై కోర్టు విచారణ జరపనుంది.

Tags:    

Similar News