చెట్టు కొట్టేసిన పాపానికి లక్ష రూపాయల ఫైన్‌

Update: 2019-09-27 12:22 GMT

షాపు ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేడుకలకు అడ్డుగా ఉందని రోడ్డు పక్కన ఏపుగా ఎదిగిన పచ్చని చెట్టును నరికిన ఓ షాప్ యజమానికి లక్ష రూపాయలు జరిమానా విధించడంతోపాటు, క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన సూర్యాపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని కుడకుడ రోడ్డులో నూతనంగా రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ షోరూంను ఏర్పాటు చేశారు. దీని ఓపెనింగ్ సందర్భంగా షాపుకు అడ్డుగా ఉన్న ఓ చెట్టును నిర్వాహకులు కొట్టివేశారు. ఈ విషయం తెలుసుకున్న పర్యావరణ ప్రేమికులు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ అమయ్ కుమార్ షాపు యజమానికి లక్ష రూపాయల జరిమానా విధించడంతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేయించారు. తెలియకుండా చేసిన పనికి ఇంత జరిమానా విధించడం ఏంటని షాపు యజమాని వాపోతున్నాడు. 

Tags:    

Similar News