పదవి విరమణ చేసి ఉపాధ్యాయుడు వెళ్లిపోతున్నాడని విద్యార్థుల కన్నీళ్లు

గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరహ: .. అంటారు. గురువును భగవంతుడితో సమానంగా కొలుస్తారు.

Update: 2020-03-01 04:33 GMT

గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరహ: .. అంటారు. గురువును భగవంతుడితో సమానంగా కొలుస్తారు. పిల్లల భవిష‌్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయుడితో వారికి ఉండే అనుబంధం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి గురువు పదవి విరమణ చేసి వెళ్లిపోతుండటంతో విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ ఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రంలో జరిగింది. ప్రాథమికోన్నత పాఠశాలలో ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు లక్కం శంకర్ యాదవ్.. పదవి విరమణ పొందారు. అయితే పాఠశాలలో చివరి రోజున విధుల నుంచి వెళ్తుండగా.. విద్యార్థులు ఒక్కసారిగా ఆయనను చుట్టుముట్టారు.

తమను వదిలి వెళ్లోదంటూ విలపించారు. ఉపాధ్యాయుడు ఎంత చెప్పిన వారు ఊరుకోలేదు. మమ్మల్ని వదిలి వెళ్ల వద్దంటూ కన్నీరు పెట్టుకున్నారు. దీనిని అక్కడున్న మరో టీచర్ మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేశారు. 

Full View

Tags:    

Similar News