అబ్దుల్లాపూర్ మెట్టులో విషాదం.. మహాత్మా జ్యోతిరావుపూలే పాఠశాలలో విద్యార్ధి ఆత్మహత్య
Abdullapur: ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ రంజిత్
అబ్దుల్లాపూర్ మెట్టులో విషాదం.. మహాత్మా జ్యోతిరావుపూలే పాఠశాలలో విద్యార్ధి ఆత్మహత్య
Abdullapur: అబ్దుల్లాపూర్ మెట్టులో విషాదం చోటుచేసుకుంది. మహాత్మా జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న రంజిత్ అనే విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య కి పాల్పడ్డాడు. మృతుడు రంజిత్ యాదాద్రి జిల్లా చౌటుప్పల్ కేసారంకు చెందినట్టు తెలుస్తోంది. కాగా తల్లిదండ్రులు విద్యార్ధిని నిన్నగురుకుల పాఠశాలలో చేరిపించి వెళ్లగా ..ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. విద్యార్ధి ఆత్మహత్య కి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.