తెలంగాణలో ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువు పెంపు

Update: 2020-04-30 09:13 GMT

లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో నిర్వహించాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ గడువును రాష్ట్ర ఉన్నత విద్యామండలి పొడిగించింది. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఇందులో ఎంసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌, ఈసెట్‌, పీజీఈసెట్‌, పీఈసెట్‌, లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ ఉన్నాయి.

Tags:    

Similar News