Srinivas Goud: ఈనెల 9న శిల్పారామంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నాం

Srinivas Goud: 10 కంపెనీల్లో 650 ఉద్యోగాలు కల్పిస్తామన్న శ్రీనివాస్ గౌడ్

Update: 2023-08-02 08:44 GMT

Srinivas Goud: ఈనెల 9న శిల్పారామంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నాం

Srinivas Goud: మహబూబ్ నగర్‌లో నూతనంగా ప్రారంభించిన ఐటీ కారిడార్‌లోని కంపెనీల్లో నియామకాల కోసం ఈ నెల 9న శిల్పారామంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు మంత్రి శ్రీనినాస్ గౌడ్ తెలిపారు. 10 కంపెనీల్లో ఈ ఉద్యోగాలు ఉంటాయని మొదటి దశలో 650 ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎక్కడికో వెళ్లకుండా ఉన్న చోటేఉద్యోగం రావడం అదృష్టమని తెలిపారు. మెట్రో రైలు షాద్‌నగర్ వరకు వస్తుందని... భవిష్యత్‌లో మహబూబ్‌నగర్ ఐటీ టవర్ వరకు తెస్తామని తెలిపారు. మహబూబ్‌నగర్ త్వరలోనే కార్పొరేషన్ అవుతుందని వివరించారు.

Tags:    

Similar News