Hyderabad: కరోనా వైరస్ రాకూడదని చిలుకూరులో ప్రత్యేక పూజలు

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా వ్వాపిస్తుందని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

Update: 2020-02-06 09:28 GMT

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా వ్వాపిస్తుందని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పటికే వేల మందిని పొట్టలో పెట్టుకుంది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వైరస్ దేశాల్లో వ్యాప్తి చెందుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా, ఎవరికీ సోకకుండా ఉండాలనే ఉద్దేశంలో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

ఇప్పుడు ఇదే నేపథ్యంలో చిలుకూరు బాలాజీ ఆలయంలో కూడా కరోనా వైరస్ నగరంలో ఎవరికీ సోకకుండా ఉండాలని ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ పంతులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపుగా 2 వేల మంది భక్తులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమం నిర్వహించినంత సేపు భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి ధ్యానంలో ఉండిపోయారు. ఈ పూజ నిర్వహణ అనంతరం పవిత్ర తీర్థాన్ని భక్తులందరిపై చల్లారు.

ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు రంగరాజన్‌ మాట్లాడుతూ దేశంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా చిలుకూరు బాలాజీ స్వామివారు ముందుంటారన్నారని తెలిపారు. భక్తులు కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయని ఆయన తెలిపారు. ఆపద మొక్కుల వాడు అందరినీ కాపాడతాడని తెలిపారు.

Tags:    

Similar News