SP Sindhu Sharma: ఆస్తి కాజేయడం కోసం ఒకే కుటుంబంలోని ఆరుగురిని హత్య చేశారు
SP Sindhu Sharma: కేసును అన్ని విధాలుగా దర్యాప్తు చేస్తున్నాం
SP Sindhu Sharma: కామారెడ్డి ఆరుగురి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఆరుగురి హత్య కేసులోను ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్టు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు. ప్రధాన నిందితుడు ప్రశాంత్ ప్రణాళిక బద్ధంగా హత్యలు చేసినట్లు గుర్తించామని ఎస్పీ తెలిపారు. ఆస్తిని కాజేయడం కోసమే ఒకే కుటుంబంలోని ఆరుగురిని హత్య చేశారని ఎస్పీ తెలిపారు.