Siddaramaiah: కర్ణాటక ప్రభుత్వ హామీలపై బీఆర్ఎస్ అసత్యప్రచారం చేస్తోంది

Siddaramaiah: మా గ్యారెంటీ పథకాల అమలుపై విచారణ చేసుకోవచ్చు

Update: 2023-11-26 08:46 GMT

Siddaramaiah: కర్ణాటక ప్రభుత్వ హామీలపై బీఆర్ఎస్ అసత్యప్రచారం చేస్తోంది

Siddaramaiah: కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు అమలు కావడం లేదనే విమర్శలను ఖండించారు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య. ఫస్ట్ కేబినెట్‌లోనే ఐదు గ్యారెంటీలను ఆమోదించామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ తరఫున ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన సిద్ధరామయ్య.. ఐదు గ్యారెంటీల అమలుపై కేసీఆర్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

ఐదు గ్యారంటీల అమలుతో కన్నడ మహిళలు సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రోజుకు 62లక్షల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. తన భార్య కూడా ఫ్రీగా ట్రావెల్ చేస్తుందని చెప్పారు. కావాలంటే 5 గ్యారెంటీ పథకాల అమలుపై విచారణ జరిపించుకోవచ్చన్నారు. హామీల అమలుపై తాము చెప్పేవి నిజమని, కేసీఆర్ చెప్పేవి అబద్ధమన్నారు సిద్ధరామయ్య.

Tags:    

Similar News