పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి సీనియర్‌ల చెక్..!

*రాష్ట్ర జెండా ఆవిష్కరణపై సీనియర్ల అసంతృప్తి

Update: 2022-09-16 05:44 GMT

సెప్టెంబర్‌ 17పై రేవంత్ వ్యూహానికి సీనియర్ల చెక్..?

Revanth Reddy: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సీనియర్‌ల మధ్య వార్ మళ్లీ తెరపైకి వచ్చింది. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, కొత్త జెండాపై విస్తృతస్థాయి సమావేశంలో ఆమోదం పొందినప్పటికీ సీనియర్‌ల వ్యతిరేకతతో రేవంత్‌రెడ్డి వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. అయితే రేవంత్‌ రెడ్డి ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించారు. రేపు గాంధీభవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహం, కొత్త జెండాను ఆవిష్కరించాలని నిర్ణయించారు. సీనియర్‌ల వ్యతిరేకతతో వెనక్కుతగ్గిన రేవంత్ రేపు జాతీయ జెండా ఎగురవేయడానికి మాత్రమే పరిమితం కానున్నారు.

Tags:    

Similar News