తెలంగాణలో రెండో విడత పరిషత్ పోలింగ్ ప్రారంభం

Update: 2019-05-10 01:12 GMT

తెలంగాణలో ZPTC, MPTC రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. సాయంత్రం 5 వ‌ర‌కు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక కేంద్రాల్లో 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. 179 జెడ్పీటీసీ,1850 ఎంపీటీసీ స్థానాలకు ఇవాళ పోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. స్థానిక సంస్థల్లో పట్టు నిలుపుకునేందుకు టీఆరెస్.. సత్తా చాటేందుకు కాంగ్రెస్ నేతలు హోరాహోరీ ప్రచారాన్ని నిర్వహించారు. మేడ్చల్-మల్కాజ్‌గిరి మినహా మిగతా జిల్లాల్లో రెండో విడత పోలింగ్ జరగనుంది. 

Similar News