Congress Bus Yatra: తెలంగాణలో కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర

Congress Bus Yatra: ఈ నెల 31 వ తేదీన కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభ కి ప్లాన్..

Update: 2023-10-24 09:29 GMT

Congress Bus Yatra: తెలంగాణలో కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర

Congress Bus Yatra: తెలంగాణలో అధికారం లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతోంది. అగ్రనేతల వరుస పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తించనుంది. కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర చేయనుంది. బస్సు యాత్రలో ప్రియాంకాగాంధీ, కర్ణాటక సీఎం సిద్ధా రామయ్య పాల్గొన్నారు. ఈ నెల 28 వ తేదీ నుండి రెండవ విడత బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 28,29 తేదీ లలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య. 30,31 తేదీ లలో ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. సిద్ధరామయ్య పర్యటనలో బీసీ డిక్లరేషన్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రియాంక గాంధీ పర్యటనలో మహిళా డిక్లరేషన్ ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ నెల 31 వ తేదీన కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభ కి ప్లాన్ చేస్తోంది.

Tags:    

Similar News