Bandi Sanjay: రెండో రోజుకు చేరుకున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర

Bandi Sanjay: * ఇవాళ మెహిదిపట్నం నుంచి బాపూఘాట్ వరకు పాదయాత్ర * సాయంత్రం 4గంటలకు గోల్కొండ దగ్గర బహిరంగ సభ

Update: 2021-08-29 02:55 GMT

రెండో రోజుకు చేరుకున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర

Bandi Sanjay Praja Sangrama Yatra: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజుకు చేరుకుంది. ఇవాళ మెహిదిపట్నం నుంచి బాపూఘాట్ వరకు సాగనుంది. నానల్‌నగర్ చౌరస్తా, టోలిచౌకి చౌరస్తా, షేక్ పేట నాలా వరకు కొనసాగించి.. అక్కడే భోజనం చేయనున్నారు.. అనంతరం గోల్కొండ, బాపూఘాట్ వరకు 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు బండి సంజయ్.. సాయంత్రం నాలుగు గంటలకు గోల్కొండ లో బహిరంగ సభలో పాల్గొననున్నారు. రాత్రి బాపూఘాట్‌లో బస చేయనున్నారు బండి సంజయ్.

Tags:    

Similar News