ఫిబ్రవరి 1నుంచి తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్‌

Update: 2021-01-11 09:49 GMT

ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫిబ్రవరి 1నుంచి తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. 9వ తరగతి నుంచి క్లాసుల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంత్రులు, కలెక్టర్ల మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్ రెవెన్యూశాఖలో సమస్యల పరిష్కారానికి ఆదేశించారు. అలాగే, ధరణి పోర్టల్‌ అవసరమైన మార్పులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇఛ్చారు. ఇక, కరోనా వ్యాక్సినేషన్‌కు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Tags:    

Similar News