Sama Rangareddy: బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వ భూములు.. పార్కులను కబ్జాలు చేస్తున్నారు

Sama Rangareddy: ఎల్బీనగర్ నియోజకవర్గ సమస్యలపై రాష్ట్ర పార్టీకి నివేదిక ఇస్తా

Update: 2023-02-26 11:30 GMT

Sama Rangareddy: బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వ భూములు.. పార్కులను కబ్జాలు చేస్తున్నారు

Sama Rangareddy: ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కొత్త మోసాలతో వస్తున్నారని, దీనిని ప్రజలు గమనించాలన్నారు బీజేపీ అర్బన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి. హైదరాబాద్ కొత్తపేటలో కార్పొరేటర్ పవన్ కుమార్ ఏర్పాటు చేసిన 'ప్రజా గోస - బీజేపీ భరోసా' కార్నర్ మీటింగ్‌లో సామ రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ తొమ్మిదేళ్లలో రేషన్ కార్డులు, పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్‌ల కోసం ప్రజలు కాళ్లరిగేలా తిరుగుతున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ భూములను, పార్కులను కబ్జాలు చేస్తున్నారని సామ రంగారెడ్డి ఆరోపించారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.

Tags:    

Similar News