తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె... జేబీఎస్ వద్ద ప్రయాణికుల ఇబ్బందులు
-జేబీఎస్ వద్ద ప్రయాణికుల ఇబ్బందులు -ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్న ప్రయాణికులు -అధిక చార్జీలు వసూలు చేస్తున్న క్యాబ్ డ్రైవర్లు
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగుతోంది. హైదరాబాద్ జేబీఎస్ వద్ద బస్సులు లేక ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల వైపు వెళ్లేందుకు ప్రయాణికులు క్యాబ్లను ఆశ్రయిస్తున్నారు. అయితే క్యాబ్ డ్రైవర్లు అధికమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు.