ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు సమ్మెలో ఉండటం వల్ల తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను విధుల్లోకి తీసుకుంది ప్రభుత్వం. అయితే ఈ డ్రైవర్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ ప్రయాణికులకు దొరికిపోయాడు. మద్యం మత్తులో బస్సు నడుపుతుండగా అనుమానం వచ్చిన ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ ఎండీ జాకీర్ను అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు.