హైద్రాబాద్ లో దొంగలు మరోసారి తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఈసారి చిన్నాచితక వస్తువు కాదు.. ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లారు. MGBS దగ్గరున్న గౌలిగూడ బస్టాప్లో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కుషాయిగూడ డిపోకు చెందిన డ్రైవర్ వెంకటేశం ఏపీ 11 జెడ్ 6254 నెంబర్ గల ఆర్టీసీ బస్సును సీబీఎస్లో నిలిపి రెస్ట్రూమ్కు వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు డ్యూటీ కోసం వెళ్తే బస్సు కన్పించలేదు. అన్నిచోట్లా వెతికినా బస్సు కన్పించలేదు. దీంతో చోరీకి గురైందని గ్రహించి..
అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే.. మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తూప్రాన్ ప్రాంతంలో ఆ సిటీ బస్సు తిరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఆ మార్గంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. నాందేడ్కు వెళ్లే రూట్ను బస్సులోని వ్యక్తి అడిగినట్లు చెబుతున్నారు. దీంతో బస్సు మహారాష్ట్రకు వెళ్లి ఉండవచ్చని పోలీసులు ఆ దిశగా గాలింపు చర్యలు చేపట్టారు.