మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ దగ్గర ఆర్టీసీ బస్సుకు భారీ ప్రమాదం తప్పింది. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి అవుషాపూర్ దగ్గర అదుపు తప్పిన.. రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్లో 50 మంది ప్రయాణీకులున్నారు. పలువురు ప్రయాణీకులు స్వల్పంగా గాయపడ్డారు. అయితే ప్రమాదానికి బస్ బ్రేకులు ఫెయిల్ అయ్యాయని.. ప్రయాణీకులు చెబుతున్నారు.