అంబర్పేట్ ఇరానీ హోటల్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. సడన్గా బ్రేక్ ఫెయిల్ కావడంతో డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేకపోయాడు. దీంతో రెండు కార్లను ఢీకొట్టాడు. ఆటోను తప్పించే క్రమంలో కరెంటు స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి.