హజ్యాత్రలో గాయపడిన వ్యక్తికి సౌదీ ప్రభుత్వం పరిహారం మంజూరు చేసిందన్నారు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ. హైదరాబాద్ కు చెందిన ముజీబ్ అనే వ్యక్తికి 95 లక్షలను సౌదీ ప్రభుత్వం చెల్లించిందన్నారు. 2015లో హజ్ యాత్రలో జరిగిన ప్రమాదంలో ముజీబ్ గాయపడ్డాడు. సౌదీ ప్రభుత్వం నుంచి వచ్చిన చెక్కును రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ బాధితుడికి అందజేశారు. కేసీఆర్ చొరివతో సౌదీ ప్రభుత్వం నిధులు రిలీజ్ చేసిందన్నారు. హుజూర్నగర్లో ఎవరిపై కేసులు పెట్టలేదన్న ఆయన తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్లో నిలిచిందన్నారు.