ఔటర్ రింగ్ రోడ్డు అప్పా జంక్షన్ వద్ద హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందగా.. వారి వెంట ఉన్న చిన్నారి తీవ్రంగా గాయపడింది. చిన్నారిని మెరుగైన వైద్యం నిమిత్తం నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మైనర్ కారు నడపడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. బైక్ను ఢీకొట్టి రోడ్డు పక్కనే ఉన్న కాల్వలోకి కారు దూసుకెళ్లింది.