Huzurabad: హుజూరాబాద్ తో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Huzurabad: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Update: 2024-04-06 09:06 GMT

Huzurabad: హుజూరాబాద్ తో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Huzurabad: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి దగ్గర శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల జాతరలో పాల్గొని బైక్ పై ఇంటికి వెళుతుండగా లారీ నుంచి మట్టిపడటంతో ముగ్గురు మృతి చెందారు. లారీని డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి ఆపడంతో లారీలో ఉన్న మట్టి మొత్తం బైక్ పై పడింది. స్థానికులు మట్టి పక్కకు తీసి రక్షంచే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే వారు మృతి చెందారు. మట్టిలోకూరుకుపోయి ఊపిరాడక మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుల్లో విజయ్, వర్ష సొంత అన్నాచెలెళ్లు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Tags:    

Similar News