అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డిపై తహశీల్దార్ కార్యాలయంలోనే కిరోసిన్ పోసి సజీవదహనం చేయడంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై ఎంపీ రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ట్విట్టర్ లో స్పందించిన ఆయన, తహశీల్దార్ విజయారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న అధికారులకు ప్రభుత్వం సరైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనకు కారకులైన నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని ట్వీట్ చేశారు.
అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయ రెడ్డి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. అధికారులకు ప్రభుత్వం సరైన రక్షణ కల్పించాలి. ఈ సంఘటనకు కారకులైన నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలి #RIPvijayareddy
— Revanth Reddy (@revanth_anumula) November 4, 2019