రాష్ట్ర ప్రభుత్వ తీరుపై లోక్‌సభకు స్పీకర్‌కు రేవంత్‌ ఫిర్యాదు

Revanth Reddy: పార్లమెంట్‌ సమావేశాలకు రాకుండా అరెస్ట్‌ చేశారని ఆరోపణ

Update: 2021-07-19 06:20 GMT

రేవంత్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Revanth Reddy: కోకాపేట్ భూముల అమ్మకాల్లో అవినీతి జరిగిందంటూ ఆరోపిస్తున్న కాంగ్రెస్.. ఇవాళ కోకాపేటలో పర్యటనకు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పీసీసీ చీఫ్ రేవంత్ సహా వర్కింగ్ ప్రెసిడెంట్లు, ముఖ్య నేతల ఇళ్ల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసి హౌస్ అరెస్ట్ చేశారు. దీనితో రాష్ట్ర ప్రభుత్వ, పోలీసుల తీరుపై లోక్‌సభ స్పీకర్‌కు టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. పార్లమెంట్‌ సమావేశాలకు హాజరవ్వకుండా హౌస్‌ అర్టెస్ట్‌ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags:    

Similar News