సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి గ్రామంలో ఓ వివాహ వేడుక రణరంగంగా మారింది. పెళ్లిలో అమ్మాయి తరపు, అబ్బాయి తరుపు బంధువులు చితకొట్టుకున్నారు. పెళ్లి ఊరేగింపులో అబ్బాయి తరపు వాళ్లు డీజే పెట్టాలని కోరారు. అయితే దీనికి అమ్మాయి తరపు వారు ఒప్పుకోలేదు. దీంతో మాటమాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది.
ఆడమగ అనే తేడా లేదు. ఎవరు ఎక్కడున్నారో చూసుకోలేదు. కనిపించిన కూర్చిలు.. వస్తువులు ఒకరిపై ఒకరు విసిరేసుకున్నారు. అడ్డం వచ్చిన వారిని తోసేశారు. పెళ్లి వేడుక కాస్త యుద్ధంగా మారింది. కొందరికి తలలు పగిలితే మరికొందరికి ఒంటిపై ఎక్కడపడితే అక్కడ గాయాలయ్యాయి.