ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బెజవాడ రవిబాబు, సిపిఎం నాయకులు శీలం నరసింహారావు, టిడిపి నాయకులు చేకూరి శేఖర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
మధిర: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల చూపిస్తున్న వైఖరికి నిరసనగా ప్రజా రవాణా వ్యవస్థ కొనసాగించాలని, ఆర్టీసీ కార్మికులను వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసి జెఎసి నాయకులు, అఖిలపక్ష నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు సేవ్ ఆర్టీసీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బెజవాడ రవిబాబు, సిపిఎం నాయకులు శీలం నరసింహారావు, టిడిపి నాయకులు చేకూరి శేఖర్ బాబు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.