టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీబాబు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతోన్న ఆయన తల్లి లక్ష్మీబాయి నేడు తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 90 సంవత్సరాలు. ఈ రోజు ఉదయం హైదరాబాద్లోని డీఎస్ నివాసంలో ఆమె కన్నుమూశారు. విషాద ఘటనను తెలుసుకున్న పలువురు నేతలు, కార్యకర్తలు డీఎస్ నివాసానికి వెళ్లి ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించారు.