ఎంపీ రేవంత్రెడ్డి బెయిల్ పిటిషన్పై ఇవాళ వాదనలు.. చర్లపల్లి జైలు వద్ద భారీగా పోలీసుల మోహరింపు
మంత్రి కేటీఆర్ ఫామ్హౌస్పై డ్రోన్ ఎగరవేసిన కేసులో నేడు రాజేంద్రనగర్ కోర్టులో విచారణ జరగనుంది. ఎంపీ రేవంత్రెడ్డి బెయిల్ పిటిషన్పై ఇవాళ వాదనలు జరగనున్నాయి. ఈ కేసులో 8 మందిని నిందితులుగా చేర్చి అరెస్ట్ చేశారు నార్సింగి పోలీసులు. గత విచారణలో ఆరుగురికి రాజేంద్రనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రేవంత్ బెయిల్ పిటిషన్ను కోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది. ఎంపీ రేవంత్రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశం ఉండటంతో చర్లపల్లి సెంట్రల్ జైలు వద్ద పోలీసులు భారీగా మోహరించారు.