కేసీఆర్ బతికున్నంత వరకు రైతుబంధు ఉంటది : సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ బతికున్నంత వరకు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతవరకు రైతుబంధు ఉంటదని కేసీఆర్ స్పష్టం చేశారు.
సుదీర్ఘ క్యాబినెట్ మీటింగ్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు. ఈ మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మే 29 వరకు లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. కరోనా రాష్ట్రంలో అదుపులో ఉందని, ప్రజలు సహకరించాలని కోరారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ బతికున్నంత వరకు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతవరకు రైతుబంధు ఉంటదని కేసీఆర్ స్పష్టం చేశారు. రైతుబంధులో ఒక్క పైసా కూడా కోత ఉండదని వెల్లడించారు. రైతుల సంక్షేమంలో రాజీపడేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. రైతుల విషయంలో ఇతర పార్టీలు అనవసరపు రాజకీయం చేయొద్దని పేర్కొన్నారు. అంతేకాకుండా రూ. 25 వేల లోపు ఋణం ఉన్న రైతులకి రేపే మాఫీ చేస్తామని కేసీఆర్ వెల్లడించారు.