R Krishnaiah: డీఎస్సీని రద్దు చేసి టెట్ నోటిఫికేషన్ వేయాలి

R Krishnaiah: నోటిఫికేషన్ జారీ చేయడం సరైంది కాదు

Update: 2024-02-29 11:55 GMT

R Krishnaiah: డీఎస్సీని రద్దు చేసి టెట్ నోటిఫికేషన్ వేయాలి

R Krishnaiah: టెట్ నిర్వహించి మెగా డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. టెట్ నిర్వహించకుండా కేవలం 11 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం సరైంది కాదన్నారు. ఇదే డిమాండ్ పై తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ పిలుపునిచ్చిన ఛలో డీఎస్సి నిరుద్యోగులు నిరసనకు ఆర్. కృష్ణయ్య మద్దతు తెలిపిపారు. బీఈడీ, డీఈడీ పాసైన నిరుద్యోగులు టెట్ వెయ్యనందుకు తీవ్ర ఆగ్రహం అసంతృప్తితో ఉన్నారన్నారు. డీఎస్సీ టెట్ ఒకసారి వేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిలేదని... వెంటనే డీఎస్సీని రద్దు చేసి టెట్ నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News