చర్లపల్లి జైలుకు ప్రియాంక హత్య కేసు నిందితులు

Update: 2019-11-30 11:47 GMT
ప్రియాంక

ప్రియాంకరెడ్డి హత్య కేసు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రత్యేక బస్సుల్లో నిందితులు నలుగురిని తరలించారు. అయితే నిందితులు జనాలకు కనిపించకుండా బస్సు మధ్యలో పడుకోబెట్టి తరలించారు. అయితే పెద్ద సంఖ్యలో చేరుకున్న జనం బస్‌లను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

రాళ్లు, చెప్పులు విసిరేశారు. అప్పటికే పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు వారిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వేలాదిగా తరలివచ్చిన నిరసనకారులు నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.  

Tags:    

Similar News