Hyderabad: వివాహేతర సంబంధం.. మహిళను హత్య చేసి.. మ్యాన్ హోల్‌లో దాచిపెట్టిన పూజారి

Update: 2023-06-09 07:07 GMT

Hyderabad: వివాహేతర సంబంధం.. మహిళను హత్య చేసి.. మ్యాన్ హోల్‌లో దాచిపెట్టిన పూజారి

Hyderabad: హైదరాబాద్ శంషాబాద్‌లో దారుణం జరిగింది. తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ అప్సరను శంషాబాద్ సమీపంలోని నర్కుడ వద్ద హత్య చేసిన నిందితుడు వెంకటసాయి సూర్యకృష్ణ. మృతదేహాన్ని సరూర్‌నగర్ వద్ద ఓ మ్యాన్ హోల్‌లో దాచిపెట్టాడు. తనను పెళ్లి చేసుకోవాలని మృతురాలు ఒత్తిడి చేయడంతోనే ఆమెను అడ్డు తొలగించుకోవడానికి పథకం పన్నాడు. సరూర్‌నగర్ నుంచి మహిళను కారులో ఎక్కించుకుని శంషాబాద్ సమీపంలోని నర్కుడ వద్దకు తీసుకొచ్చి తలపై బండరాయితో మోది హత్య చేశాడు.

అనంతరం మహిళ మృతదేహాన్ని ఓ కవర్‌లో కట్టి కారులో తీసుకెళ్లి సరూర్‌నగర్‌లోనే ఓ మ్యాన్‌హోల్‌లో పడేశాడు. తర్వాత తానేమీ ఎరుగనట్లు పోలీసులను తప్పుదారి పట్టించేలా నిందితుడు వ్యవహరించాడు. మహిళ అప్సర కనిపించడం లేదంటూ ఆర్‌జీఐఏ పోలీసు స్టేషన్‌లో నిందితుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి అసలు విషయాన్ని బయటపెట్టారు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఈనెల 3న మహిళను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే పూజారి వెంకటసాయి సూర్యకృష్ణకు ఇదివరకే వివాహం జరగ్గా.. ఇద్దరు సంతానం ఉన్నారు. 

Tags:    

Similar News